కరోనా టెస్టులకు డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారని
తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
కరోనా టెస్టులకు డబ్బులు ఎందుకు
వసూలు
చేస్తున్నారని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉచితంగా కోవిడ్
పరీక్షలు నిర్వహించకుండా.. ఒక్కో
టెస్టుకు రూ.4500
చొప్పున ఎందుకు
వసూలు
చేస్తున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఏప్రిల్ 8లోగా
బదులివ్వాలని ఆదేశించింది. తెలంగాణలో గాంధీ
హాస్పిటల్, ఫీవర్
హాస్పిటల్, చెస్ట్
హాస్పిటల్తోపాటు
వరంగల్
ఎంజీఎంలో కరోనా
పరీక్షలు చేస్తున్నారు. సీసీఎంలో కోవిడ్
పరీక్షలను చేయడానికి ఇటీవలే
కేంద్రం అంగీకరించగా.. తెలంగాణలోని మరో
ఐదు
ప్రయివేట్ ల్యాబ్ల్లోనూ కోవిడ్ పరీక్షల నిర్వహణకు కేంద్రం అంగీకరించింది.
కరోనా ప్రభావంతో అత్యవసర కేసుల విచారణకు హైకోర్టు ఇదివరకే వర్చువల్ కోర్టులను ఏర్పాటు చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి లాక్డౌన్ నేపథ్యంలో వివిధ కేసుల్లో స్టే ఆర్డర్ల గడువును హైకోర్టు మూడు నెలలపాటు పొడిగించిన సంగతి తెలిసిందే. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో పదోతరగతి పరీక్షలను వాయిదా వేయాలని కూడా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం విదితమే.

No comments:
Post a Comment